ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే?

  • తుది జాబితాను మరోసారి పరిశీలించాలని బోర్డు నిర్ణయం
  • బుధవారం వెల్లడించనున్నట్లు ప్రకటించిన హోంమంత్రి అనిత
  • 2022 లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నిర్ణయించిందని, ఎలాంటి చిక్కులు రాకూడదనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రోజు ఫలితాలను పరిశీలించి బుధవారం విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.


More Telugu News