వియత్నాం తీరంలో విషాదం... పడవ బోల్తా పడి 34 మంది మృతి
- వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బేకు పడవ వెళ్తుండగా ప్రమాదం
- బలమైన గాలులతో తల్లకిందులైన పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ
- మరో 8 మంది గల్లంతు
- 11 మందిని కాపాడిన రెస్క్యూ బృందాలు
వివరాల్లోకి వెళితే, వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్ బేకు 48 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బందితో ఓ పడవ బయలుదేరింది. అయితే, ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి పలువురిని రక్షించాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది.