Narendra Modi: ట్రంప్ వ్యాఖ్యలపై నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలి: జైరాం రమేశ్

Narendra Modi Must Answer Trumps Remarks Says Jairam Ramesh
షార్ట్స్‌లో చూడండి
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 23 సార్లు చెప్పారని, రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ నెల 21న పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

"భారత్-పాక్ మధ్య అణు యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఇప్పటికి 23 సార్లు ఆయన ఆ మాట చెప్పారు. రానున్న శీతాకాల సమావేశంలో రాజ్యసభ, లోక్‌సభలలో ప్రధానమంత్రి దీనిపై సమాధానం చెప్పాలి. దేశ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు" అని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Donald Trump
India Pakistan
JaiRam Ramesh
Congress Party
Parliament Winter Session
Ceasefire Agreement
Nuclear War

More Telugu News