Vidyasagar: అరుణాచల గిరి ప్రదక్షిణలో యాదాద్రి భువనగిరి జిల్లా భక్తుడు దారుణ హత్య

Yadadri Bhuvanagiri Devotee Vidyasagar Killed in Tiruvannamalai
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.

యాదాద్రి భువనగిరి జిల్లా, సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) అనే భక్తుడు గిరి ప్రదక్షిణ చేస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కిందపడిన విద్యాసాగర్ ఆ యువకులతో గొడవకు దిగాడు.

అయితే ఆ యువకులు తీవ్ర ఆగ్రహంతో తమ వద్ద ఉన్న కత్తితో విద్యాసాగర్‌పై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను సహచర భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ విద్యాసాగర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు తిరువణ్ణామలైకి చెందిన గుగనేశ్వరన్, తమిళరసన్ అని గుర్తించి అరెస్టు చేశారు. 
Go Back to Shorts
Vidyasagar
Arunachala Giri Pradakshina
Yadadri Bhuvanagiri
Tamil Nadu Crime
Murder Case
Tiruvannamalai
Telangana Pilgrim
Guganeshwaran
Tamilarasan

More Telugu News