అలనాటి నటి ముచ్చర్ల అరుణ ఇంట్లో ఈడీ సోదాలు
- భర్త మోహన్ వ్యాపార లావాదేవీలపై తనిఖీ
- చెన్నై కపాలీశ్వరర్ నగర్లోని బంగ్లాలో ఈడీ రైడ్స్
- నిర్మాణ రంగంలో ఉన్న మోహన్ గుప్తాపై ఆరోపణలు
- 10 మందికి పైగా అధికారులతో కొనసాగుతున్న తనిఖీలు
- వివాహం తర్వాత నటనకు దూరమైన ముచ్చర్ల అరుణ
మోహన్ గుప్తా నిర్మాణ రంగ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు, 10 మందికి పైగా అధికారులతో కూడిన ఈడీ బృందం ఈ సోదాలను చేపట్టినట్లు సమాచారం. ఈ తనిఖీలలో భాగంగా అధికారులు కీలకమైన పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు.
భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సీతాకోక చిలుక’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముచ్చర్ల అరుణ, ఆ తర్వాత ‘చంటబ్బాయ్’, ‘జస్టిస్ చౌదరి’ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వివాహం తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమై, కుటుంబ జీవితానికే పరిమితమయ్యారు. చాలాకాలం తర్వాత ఆమె పేరు ఈడీ సోదాల రూపంలో వార్తల్లోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.