చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ ప్రారంభం
  • కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
  • ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలు, పథకాలపై ఆరా
  • గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అని విమర్శ
  • చంద్రబాబు సీఎం అయ్యాక వ్యవస్థలు గాడిలో పడుతున్నాయని వ్యాఖ్య
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలతో నేరుగా మమేకమయ్యే లక్ష్యంతో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నియోజకవర్గ పరిధిలోని స్టోన్ హౌస్ పేటలో పర్యటించారు. సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజల సమస్యలను ఓపికగా వింటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తోందని, వ్యవస్థలన్నీ క్రమంగా గాడిలో పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోటంరెడ్డి నిన్న కూడా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. నిన్న నెల్లూరు రూరల్ 34వ డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 


More Telugu News

Kotamreddy Sridhar Reddy Chandrababu Naidu Andhra Pradesh Nellore Rural TDP YSRCP Governance Telugu Desam Party Vemireddy Prabhakar Reddy Stone House Peta