YS Jagan: 'చిప్ రింగ్‌లో కాదు, మెదడులో ఉండాలి' అన్న జగన్.. ఇప్పుడు ఆయన వేలికి కూడా!

YS Jagan Spotted with Smart Ring After Criticizing Chandrababu
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్మార్ట్ రింగ్ ధరించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్ ఇప్పుడు తానే అలాంటి రింగ్‌తో కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న‌ జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ తన ఎడమచేతి మధ్య వేలికి ఒక స్మార్ట్ రింగ్ ధరించి పాల్గొన్నారు. ఈ పరిణామం, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చింది.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ధరించిన స్మార్ట్ రింగ్‌ను ఉద్దేశిస్తూ, "చిప్‌ ఉండాల్సింది వేలికి పెట్టుకున్న రింగ్‌లో కాదు.. మెదడులో, గుండెలో ఉండాలి" అంటూ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా చంద్రబాబు అటువంటి పరికరాలు వాడితే, దానిని జగన్ వ్యంగ్యంగా విమర్శించారు.

అయితే, కాలక్రమేణా పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో జగన్ కూడా స్మార్ట్ రింగ్‌తో దర్శనమివ్వడం గమనార్హం. ఆయన ఎడమచేతి మధ్య వేలికి ఈ రింగ్ స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు తాను విమర్శించిన వస్తువునే ఇప్పుడు జగన్ కూడా వినియోగిస్తుండటంపై పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు జగన్ స్మార్ట్ రింగ్ ధరించడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. సాంకేతికత వినియోగం వ్యక్తిగత సౌలభ్యం కోసం అయినప్పటికీ, రాజకీయ నాయకుల విషయంలో వారి గత వ్యాఖ్యలతో పోల్చి చూడటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ప్రస్తుతం జగన్ ధరించిన స్మార్ట్ రింగ్ కూడా అటువంటి చర్చకే దారి తీసింది.
Go Back to Shorts
YS Jagan
Jagan Smart Ring
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
Smart Ring Technology
Political Satire

More Telugu News