Yogandhra: విశాఖ తీరంలో 'యోగాంధ్ర' సందడి.. వాకథాన్‌లో పాల్గొన్న మంత్రులు, అధికారులు

Yogandhra Walkathon Held in Visakhapatnam
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే 'యోగాంధ్ర' కార్యక్రమంపై విశాఖపట్నంలో విస్తృత ప్రచారం కల్పించారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నగరంలోని సుందరమైన బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

'యోగాంధ్ర' కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ వాకథాన్‌ను చేపట్టారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు ఈ వాకథాన్‌ కొనసాగింది. రాష్ట్ర మంత్రులు డీవీబీ స్వామి, సత్యకుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, సవిత ఈ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు. వారితో పాటు యోగా దినోత్సవ నోడల్ అధికారి కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

వాకథాన్ ముగిసిన అనంతరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ మంత్రులు, అధికారులు ప్రజలతో కలిసి వివిధ యోగాసనాలను వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం 'యోగాంధ్ర' లక్ష్యాలను ప్రజలకు మరింత చేరువ చేసిందని నిర్వాహకులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Yogandhra
Visakhapatnam
Andhra Pradesh
Yoga Walkathon
DVBSwami
Satya Kumar
BC Janardhan Reddy
Savita
Krishna Babu
Harendhira Prasad

More Telugu News