Pawan Kalyan: బక్రీద్ వేళ కొందరు గోవులను దొంగ చాటుగా కబేళాలకు తరలించే అవకాశం ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan urges protection of cows during Bakrid
షార్ట్స్‌లో చూడండి
గోవులను సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గోవులను పవిత్రంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మన సమాజంలో ఉందని, అటువంటి గోమాతలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. చట్టాలు కూడా గోవధను ఏమాత్రం అంగీకరించవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశారు. "గోమాతల సంరక్షణ కోసం ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికార యంత్రాంగానికి ప్రజల నుంచి పూర్తి సహకారం అందాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి" అని తెలిపారు. గో సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ దీన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో, కొందరు వ్యక్తులు గోవులను అక్రమంగా, దొంగచాటుగా కబేళాలకు తరలించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు అధికారులు ఇప్పటికే పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ చర్యలకు ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోవుల అక్రమ రవాణా లేదా వధకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Bakra Eid
Cow slaughter
Cow protection
Animal Welfare
Gomata
Cattle smuggling
Illegal slaughterhouses
Telugu News

More Telugu News