తొక్కిసలాట విషయం కోహ్లీకి తెలియకపోవచ్చు.. ఆర్సీబీకి మాత్రం తెలిసి ఉండొచ్చు: మాజీ క్రికెటర్
- చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట, 11 మంది దుర్మరణం
- కోహ్లీకి తెలుసంటే నమ్మలేనన్న మాజీ క్రికెటర్ వాసన్
- ఫ్రాంచైజీ, రాజకీయ నేతల తీరుపై తీవ్ర విమర్శలు
ఈ ఘటనపై ఏఎన్ఐ వార్తా సంస్థతో వాసన్ మాట్లాడుతూ, "బయట ప్రజలు చనిపోతున్నారని తెలిసి కూడా విరాట్ కోహ్లీ లోపల సన్మాన కార్యక్రమాన్ని కొనసాగించాడంటే నేను నమ్మలేను. రాజకీయ నాయకుల గురించి నేను నమ్మగలను, ఎందుకంటే వారు నిర్దాక్షిణ్యంగా, మొండిగా ఉంటారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ అనే కార్పొరేట్ సంస్థ కూడా అంతే. ఫ్రాంచైజీలు బ్యాలెన్స్ షీట్లు, ఆదాయం చూపించుకోవాలి కాబట్టి వారు పట్టించుకోరు. బహుశా వారికి తెలిసి ఉండవచ్చు. కానీ కోహ్లీకి తెలిసి ఉండకపోవచ్చు" అని వ్యాఖ్యానించారు.
"విరాట్ కోహ్లీకి, ఆటగాళ్లకు ఈ విషయం తెలిసేసరికి, వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఉంటారు. ఒకవేళ విరాట్కు తెలిసి ఉంటే, అతను వెంటనే బయటకు వచ్చేసేవాడు. విరాట్కు తెలిసి ఇలా జరిగిందంటే నేను నమ్మలేను. కానీ ఇది చాలా విచారకరం, చాలా విషాదకరం" అని వాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.