కడపలో టీడీపీ జెండా ఎగరేశాం.. ఆ కిక్కే వేరు: హోంమంత్రి అనిత

మహానాడులో పాల్గొంటే ఆ అనుభూతే వేరని, ముఖ్యంగా కడప లాంటి చోట పార్టీ జెండా ఎగరేయడం కార్యకర్తలకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. "కడప మా అడ్డా" అంటూ కొందరు గతంలో ప్రగల్భాలు పలికారని, అలాంటి చోట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందని ఆమె వ్యాఖ్యానించారు.

పసుపు చొక్కా ధరించి, పసుపు జెండా చేతబట్టి మహానాడులో కార్యకర్తలు ఉత్సాహంగా తిరుగుతుంటే ఆ కిక్కే వేరని మంత్రి అనిత అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సంచలనమని, పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనమని ఆమె పేర్కొన్నారు.

"మహానాడును కడపలో నిర్వహించడం మేమందరం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే, కడప నా అడ్డా, ఇక్కడికి ఎవరూ రాలేరు అంటూ కొందరు ఎన్నో ప్రగల్భాలు పలికిన చోట కూడా ఈరోజు జెండా కట్టగలిగాం" అని మంత్రి అనిత తెలిపారు. ప్రతి కార్యకర్త పసుపు చొక్కా వేసుకుని, పసుపు జెండా పట్టుకుని మహానాడులో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News