వల్లభనేని వంశీ ఆసుపత్రికి తరలింపు
కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆయన అస్వస్థతకు గురికావడంతో అధికారులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.