పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం... జగన్ దిగ్భ్రాంతి

Jagan expresses grief over Palnadu road accident
  • ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి
  • మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు
  • ఈ దుర్ఘటన బాధాకరమన్న జగన్
పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్కు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Jagan Mohan Reddy
Road Accident
Palnadu District
Andhra Pradesh
Fatal Crash
Truck Accident
Agricultural Workers
Vinukonda Mandal
Sivapuram
Prakasam District

More Telugu News