ఈ నెల 7న సమ్మె.. హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ నిరసన ర్యాలీ
- హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుల కవాతు
- చర్చలకు పిలవలేదంటూ జేఏసీ ఆగ్రహం
- ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కవాతు
తమ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాకపోవడంతో అనివార్యంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ఆహ్వానించలేదని, అందుకే సమ్మె సన్నద్ధతలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నామని వివరించారు. కవాతు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవాతు సాగిన మార్గంలోనూ, బస్ భవన్ వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.