పహల్గాం ఉగ్రదాడి.. క్రికెటర్ల రియాక్షన్స్
- మంగళవారం కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి
- 26 మంది పర్యాటకులు మృతి
- ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించిన భారత క్రికెటర్లు
"ఈరోజు కశ్మీర్లో ఏమి జరిగిందో విని షాక్ అయ్యాను. తీవ్రంగా కలిచివేసింది. బాధ్యులు కచ్చితంగా శిక్షించబడతారు. ఇదంతా జరిగిన విధానం ఎంతో బాధించింది. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాను" అని పార్థివ్ పటేల్ అన్నాడు.
"పహల్గాంలో జరిగిన దాడి ఘటన హృదయాన్ని కలిచివేసింది. బాధితులు, వారి కుటుంబాలతో నా ప్రార్థనలు ఉంటాయి. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు" అని శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు.
"పహల్గాంలో ఊహించలేని దారుణం. బాధితులకు, వారి కుటుంబాలకు హృదయం ద్రవించిపోతోంది. నేరస్థులను (మరియు వారి సానుభూతిపరులను) గుర్తించి, పట్టుకుని, వారికి తగిన శిక్ష విధించాలని ఆశిస్తున్నాను" అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
"మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. భారత్ తీవ్రంగా స్పందిస్తుంది" అని గౌతమ్ గంభీర్ అన్నాడు.
"పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి తీవ్రంగా బాధించింది. బాధితుల కోసం, వారి కుటుంబాల బలం కోసం ప్రార్థిస్తూ... వారికి మానవత్వంతో ఐక్యంగా నిలబడదాం" అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
"పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి గురించి విని చాలా బాధపడ్డాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారి కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.