హైదరాబాద్ వ్యాపారికి బుకీలతో సంబంధాలు.. జాగ్రత్త.. ఆటగాళ్లను హెచ్చరించిన బీసీసీఐ

            
క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లకు బీసీసీఐలోని యాంటీ కరప్షన్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి బుకీతో సంబంధాలు ఉన్నాయని, అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వ్యాపారి చట్ట వ్యతిరేక పనులు చేసేలా వ్యక్తులను ఒత్తిడికి గురిచేస్తున్నాడని పేర్కొంది. 

ఐపీఎల్‌లోని వ్యక్తులతో స్నేహం చేసేందుకు, సంబంధాలు పెట్టుకోవడానికి అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఖరీదైన బహుమతులు, నగలు ఇవ్వడం ద్వారా ఇప్పటికే అతడు కొంతమందితో పరిచయం పెంచుకున్నాడని, కాబట్టి ఆ వ్యక్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అభిమాని వేషంలో మ్యాచ్‌లోనూ, జట్లు బస చేసే హోటళ్లలోనూ కనిపిస్తున్నాడని తెలిపింది. బీసీసీఐ ప్రకటనతో ఐపీఎల్‌లో కలకలం రేగింది. ఆ వ్యాపారి ఎవరన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.


More Telugu News