సీఎం నితీశ్ కుమార్ భవితవ్యంపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
- నితీశ్ మరికొన్ని రోజులు మాత్రమే సీఎంగా ఉంటారన్న పీకే
- నితీశ్ ను బీజేపీ మరోసారి సీఎంగా అంగీకరించబోదని వ్యాఖ్య
- ఇండియా కూటమి తరపున గెలిచినా సీఎం కారన్న పీకే
ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్ కు చెందిన ఆర్జేడీ పోటీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా... సీఎం పదవిని బీజేపీ వదులుకునేందుకు సిద్ధంగా లేదని చెపుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రశాంత్ కిశోర్ తెలిపారు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు.