అవును, నేను కేసీఆర్‌కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • కడియం శ్రీహరిలా తాను గుంట నక్కను మాత్రం కాదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన గుంట నక్క అని కడియంపై విమర్శ
  • తనను గెలిపించిన వారిని కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పని చేస్తానని వెల్లడి
"అవును, నేను కుక్కనే. నన్ను నమ్మిన కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దూకే కడియం శ్రీహరి లాంటి గుంట నక్కను మాత్రం కాదు" అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అని ఆయన మండిపడ్డారు.

తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

Palla Rajeshwar Reddy
Janagam MLA
KCR
Brs Party
Congress Party
Kadiam Srihari
Telangana Politics
Telangana MLA
Party Hopping

More Telugu News