పది సెకన్లలో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు మార్కెట్లు కుదేల్
--
కారణాలు ఇవేనంటున్న నిపుణులు..
- ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఈ అంచనాలు వినియోగదారుల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం పడి ఆర్థిక వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు.
- ఈ పరిణామాలతో మాంద్యం తప్పదనే భయాలు నెలకొన్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు 60 శాతం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
- సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేయడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది.
- ఈ అనిశ్చితుల నేపథ్యంలో ఏప్రిల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
- ఈ నెలలో ఇప్పటివరకు రూ.13,730 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్పీఐలు విక్రయించారు. ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణుల అంచనా.
- ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభించిన ఆర్ బీఐ ఈ నెల 9న నిర్ణయాలను వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు విక్రయాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు బేర్మన్నాయి.