బాలిక హ‌త్య కేసు.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన చోడ‌వ‌రం కోర్టు

  • ఏడేళ్ల బాలికను బీరు సీసాతో గొంతుకోసి హత్య చేసిన శుభాచారి శేఖర్‌
  • సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌ నిందితుడికి ఈరోజు ఉరిశిక్ష ఖరారు చేసిన చోడ‌వ‌రం కోర్టు
  • ఈ మేర‌కు 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు
  • చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే తొలిసారి 
పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల‌ చిన్నారి హత్య కేసులో బుధవారం అనకాపల్లి జిల్లా చోడ‌వ‌రం కోర్టు సంచలన తీర్పును వెల్ల‌డించింది. ఈ కేసులో నిందితుడు శుభాచారి శేఖర్‌(31)కు న్యాయ‌స్థానం ఉరిశిక్ష విధించింది. 

దేవరాపల్లికి చెందిన శేఖర్‌కు మరణశిక్ష విధిస్తూ 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. 2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడం ఇదే మొద‌టిసారి.


More Telugu News