Hyderabad Central University: 400 ఎకరాల భూమిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీలక ప్రకటన
- కంచ గచ్చిబౌలిలోని భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటన
- టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్యూసీ
- ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదన్న సెంట్రల్ యూనివర్సిటీ
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తమదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) స్పందించింది. టీజీఐఐసీ ప్రకటనను హెచ్సీయూ ఖండించింది. ఈ మేరకు హెచ్సీయూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు.
2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ భూమిని విశ్వవిద్యాలయానికే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.
2024 జులైలో అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని, ఇప్పటి వరకు భూమి ఎలా ఉందన్న దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు భూమికి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆ భూమిని విశ్వవిద్యాలయానికే ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, భూమి కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు.