Chandrababu Naidu: ఉగాది రోజు పేదలకు సాయం అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Signs First File for Ugadi Aid to Poor
షార్ట్స్‌లో చూడండి
ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైలుపై చేశారు. ఈ నిర్ణయం ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన 3,456 మంది పేదలకు లబ్ది చేకూరనుంది. ఇందుకోసం రూ.38 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు 23,418 మంది పేదలను ఆదుకున్నామని, బాధితుల వైద్యం కోసం రూ.281.38 కోట్లు అందించామని సీఎంవో వర్గాలు తెలిపాయి.


Go Back to Shorts
Chandrababu Naidu
Ugadi
Andhra Pradesh
CM Relief Fund
Financial Aid
Poor
Needy
Medical Assistance
AP Government

More Telugu News