భగత్ సింగ్ కు మోదీ, చంద్రబాబు నివాళి
- నేడు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కిన రోజు
- 1931 మార్చి 23న వీరిని ఉరి తీసిన బ్రిటీష్ ప్రభుత్వం
- ఆ అమరవీరుల చరిత్రను మననం చేసుకుందామన్న చంద్రబాబు
- వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ప్రధాని మోదీ కూడా నివాళి అర్పించారు. వీరి పేర్లు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుందని చెప్పారు. ఈ ముగ్గురూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భరతమాత కోసం పోరాడారని అన్నారు. ఈ త్యాగమూర్తులను ఈరోజు దేశం స్మరించుకుంటోందని చెప్పారు.
1931 మార్చి 23న ఈ ముగ్గురినీ బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది. బ్రిటీష్ అధికారి శాండర్స్ ను హత్య చేయడం, పార్లమెంట్ లో బాంబులు వేయడం వంటి కారణాలు చూపుతూ ఈ ముగ్గురినీ ఉరి తాశారు. ఈ ఘటన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని తీవ్రతరం చేసింది. వీరి ప్రాణత్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు.