క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగింపు... స్టేడియం వద్ద వైసీపీ నేతల ఆందోళన
- వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగిస్తూ ప్రభుత్వ నిర్ణయం
- దీంతో కూటమి ప్రభుత్వంపై వైసీసీ నేతల విమర్శలు
- ఈ నేపథ్యంలో ఈరోజు స్టేడియం వద్ద ఆందోళనకు పిలుపు
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడంపై ఈరోజు వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మధురవాడలోని క్రికెట్ స్టేడియంకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహం ముందు నిరసనకు దిగారు.
స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును జోడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామంటున్నారు. ఇక ఈ స్టేడియంలో మార్చి 24, 30 తేదీలలో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.