మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీవైవీబీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె స్నేహ, రాజేశ్ల నిశ్చితార్థానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు. 

చంద్రబాబు రాకతో నిశ్చితార్థ వేడుకలో భారీ కోలాహలం నెలకొంది. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ నేతలు, ఇతర ముఖ్యులు తరలివచ్చారు.


More Telugu News