IPS: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ

8 IPS officers transferred in Telangana
  • 8 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్
ఎనిమిది మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా గజారావు భూపాల్, హైదరాబాద్ క్రైమ్స్ అదనపు కమిషనర్ గా విశ్వప్రసాద్, సీఐడీ ఎస్సీగా నవీన్ కుమార్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ ఎస్బీ డీసీపీగా చైతన్య కుమార్ లను నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.  
IPS
Telangana

More Telugu News