హైదరాబాద్లో నడిరోడ్డుపై తండ్రిని హత్య చేసిన కొడుకు
- కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- నిత్యం మద్యం తాగి గొడవ చేస్తుండటంతో తండ్రిని చంపిన తనయుడు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
శనివారం మధ్యాహ్నం లాలాపేట నుండి మొగిలి బస్సులో బయలుదేరగా, కొడుకు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. ఈసీఐఎల్ బస్ స్టాండ్ వద్దకు రాగానే తండ్రి మొగిలి బస్సు దిగాడు. వెంట తెచ్చుకున్న చాకుతో పది పదిహేనుసార్లు విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెండాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.