రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ.. ఆన్లైన్ జూదానికి ముగ్గురి బలి
- ఆన్లైన్ జూదం తెచ్చిన చిక్కులు
- ఒకరి పేరు చెప్పి అప్పు చేసిన మరొకరు
- రూ.80 లక్షల అప్పు మిగిలిందని ఆవేదన
కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. హాంచా గ్రామనికి చెందిన జోశి ఆంథోనీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పేరు, తన సోదరి పేరు చెప్పి.. సోదరుడు జోబి ఆంథోనీ, మరదలు షర్మిల ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారని.. రూ.80 లక్షల దాకా అప్పులు పేరుకుపోయాయని.. దీనికి రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ కట్టాల్సి వస్తోందని అంతకుముందు సెల్ఫీ వీడియోలో ఆయన వాపోయాడు. ఈ వీడియో బయటికి రావడంతో జోబి ఆంథోనీ, ఆయన భార్య షర్మిల విజయనగరంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మైసూరు, విజయనగరంలో కేసులు నమోదయ్యాయి.