వైరల్ వీడియో.. ఒక్క ఆటోలో 19 మంది ప్రయాణికులు.. నిర్ఘాంతపోయిన పోలీసులు!
- ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఘటన
- సాధారణ తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు
- అందులో ప్రయాణిస్తున్న వారిని లెక్కించి పోలీసులు షాక్
అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.