వైర‌ల్ వీడియో.. ఒక్క‌ ఆటోలో 19 మంది ప్ర‌యాణికులు.. నిర్ఘాంత‌పోయిన‌ పోలీసులు!

వైర‌ల్ వీడియో.. ఒక్క‌ ఆటోలో 19 మంది ప్ర‌యాణికులు.. నిర్ఘాంత‌పోయిన‌ పోలీసులు!

19 Passengers Found Travelling in Single Auto Rickshaw UP Police Seize Vehicle After Video Goes Viral
  • ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఘటన 
  • సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన పోలీసులు
  • అందులో ప్ర‌యాణిస్తున్న వారిని లెక్కించి పోలీసులు షాక్‌
ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధార‌ణ త‌నిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ‌ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు.

అందులో ప్రయాణిస్తున్న‌ వారిని ఒక్కొక్క‌రిగా కింద‌కు దిగ‌మ‌ని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్న‌ట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంత‌పోయారు. వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న‌ ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌ శైలిలో ఫ‌న్నీగా స్పందిస్తున్నారు.  
Advertisement
Auto Rickshaw
Passengers
UP Police
Uttar Pradesh
Viral Videos

More Telugu News