అనంతపురం జిల్లాలో దార్ గ్యాంగ్ కలకలం... ముగ్గురిని అరెస్ట్ చేశామన్న జిల్లా ఎస్పీ
- కొన్నిరోజులుగా అనంతపురం జిల్లాలో దార్ గ్యాంగ్ కదలికలు
- అప్రమత్తమైన పోలీసులు
- అనంతపురంలో గత నెలలో మూడు ఇళ్లలో చోరీ
- నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీ జగదీశ్
దార్ గ్యాంగులోని ముగ్గురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారయ్యారని వెల్లడించారు. నిందితుల నుంచి రూ.90 లక్షల విలువైన ఆభరణాలు, రూ.19.35 లక్షల నగదు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ దార్ ముఠా సభ్యులు గత నెలలో అనంతపురంలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని ఎస్పీ వివరించారు. ఈ ముఠాలోని ఒక సభ్యుడిపై ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 32 కేసులు ఉన్నాయని వెల్లడించారు.