రేపు ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం!
- రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న కేబినెట్ సమావేశం
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించనున్న కేబినెట్
- కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సమావేశం కానున్న చంద్రబాబు
రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.