తిరుపతి తొక్కిసలాట ఘటన... చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
- చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయన్న రోజా
- చంద్రబాబు, బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
- పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్న
సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ కు సంబంధం లేకపోయినా ఆయనపై కేసు పెట్టారని... ఈ ఘటనలో చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా ఎస్పీలపై కేసులు పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. సనాతన యోధుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంతమంది చనిపోతే హైందవ శంఖారావం నిర్వాహకులు ఎక్కడున్నారని అడిగారు. పీఠాధిపతులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.