నేడే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనున్న ఈసీ
- ఫిబ్రవరి 15తో ముగియనున్న ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం
- ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం చేస్తున్న ఆప్, బీజేపీ
డిసెంబర్ నెల నుంచే అధికార ఆప్, ప్రధాన విపక్షమైన బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటున్న ఆప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలుగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ సహా ఆ పార్టీ ఇతర నేతలు ఓటర్లను కోరుతున్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. హస్తం పార్టీ ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.