ఆ గదిలో జరగలేదు.. కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులో సంచలన నివేదిక
- మృతదేహాన్ని గుర్తించిన సెమినార్ రూమ్లో అత్యాచారం, హత్య జరిగినట్టుగా ఆధారాలు దొరకలేదన్న సీఎఫ్ఎస్ఎల్ నివేదిక
- ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిన ఆధారాలు లేవని వెల్లడి
- ఇటీవలే సీబీఐకి నివేదిక అందించిన సీఎఫ్ఎస్ఎల్
సెమినార్ గదిలోని నీలి రంగు పరుపుపై వైద్యురాలు, దాడికి పాల్పడ్డ వ్యక్తికి మధ్య ఎలాంటి గొడవ లేదా దాడి జరిగినట్లు ఆధారాలు కనిపించలేదని నివేదిక విశ్లేషించింది. రూమ్ లోపల మరెక్కడా ఆనవాళ్లు లేవని పేర్కొంది. ఈ మేరకు దర్యాప్తు సంస్థ సీబీఐకి సీఎఫ్ఎస్ఎల్ ఇటీవలే నివేదికను సమర్పించింది.
కాగా, ఈ ఏడాది ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం తొలుత విచారణ చేపట్టింది. ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది.