పంట పొలంలో 19 అడుగుల కొండచిలువ!
- ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో కనిపించిన భారీ కొండచిలువ
- వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
- కొండచిలువను చాకచక్యంగా బోనులో బంధించిన అటవీశాఖ సిబ్బంది
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు, సిబ్బంది కొండచిలువను చాకచక్యంగా బోనులో బంధించారు. అయితే, కొండచిలువను బోనులో బంధించే క్రమంలో దానికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. దాంతో చికిత్స అనంతరం కొండచిలువను అడవిలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు చెప్పారు.