కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
- ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు
- మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు
- నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు
బట్టతలపై మళ్లీ వెంట్రుకలు మొలిపిస్తామని ప్రచారం చేయడంతో జనం పోటెత్తారు. రద్దీ కారణంగా చుట్టుపక్కల వీధుల్లో ట్రాఫిక్ జాం అయింది. ఈ నూనె కొని వాడిన వారు నెత్తిపై దురద, అలర్జీల బారిన పడ్డారు. షాదాబ్ అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. సదరు కేశవర్ధిని నూనె అమ్ముతున్న ఇమ్రాన్, సల్మాన్, సమీర్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. విచారణలో ఇలాంటి ప్రత్యేక శిబిరాలు ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా నిర్వహించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.