మంత్రి నిమ్మల రామానాయుడుకి హరిరామ జోగయ్య లేఖ
- పాలకొల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలన్న జోగయ్య
- రాజ్య భవనాలు, పాలన భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శ
- ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని వ్యాఖ్య
రాజ్య భవనాలు, నివాస, పరిపాలన భవనాల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని జోగయ్య విమర్శించారు. ఇది నిజమైన అభివృద్ధి అనిపించుకోదని చెప్పారు. నరసాపురం, భీమవరం, రాజోలు నియోజకవర్గాలకు సమదూరంలో ఉన్న పాలకొల్లు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎవరికైనా పెద్ద వైద్య అవసరం వస్తే హైదరాబాద్ కు కానీ, వైజాగ్ కు కానీ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరం ఉందని తెలిపారు. దీనికి ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు.