ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాధించిందేమీ లేదు: హరీశ్ రావు
- ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని గప్పాలు కొడుతున్నారని విమర్శ
- 14వ తేదీ వచ్చినా జీతాలు రాలేదన్న హరీశ్ రావు
- ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తోన్న ప్రచారం ఆపాలన్న హరీశ్ రావు
రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారిని, వారి కుటుంబాలను క్షోభకు గురి చేస్తున్నారన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు... ఇలా ఎంతోమందికి సకాలంలో వేతనాలు రావడం లేదని, దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చేస్తున్న ప్రచారం ఇకనైనా ఆపాలన్నారు.