Manchu Manoj: గొడవలు పక్కన పెట్టి... షూటింగ్ కు వెళ్లిపోయిన మంచు మనోజ్

Manchu Manoj went to shooting
షార్ట్స్‌లో చూడండి
కుటుంబ గొడవలతో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం గత మూడు రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తనకు, తన కుటుంబానికి హాని ఉందంటూ ఆయన కుమారుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... మనోజ్ పై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. ఒక ఛానల్ ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యయత్నం కింద కేసు కూడా నమోదయింది. పోలీసుల సూచనలతో తన వ్యక్తిగత సిబ్బందిని, బౌన్సర్లను నిన్న సాయంత్రమే మంచు మనోజ్ వెనక్కి పంపించేశాడు. 

ఈ పరిణామాల నేపథ్యంలో... మంచు మనోజ్ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన తాజా చిత్రం 'భైరవం' షూటింగ్ కు వెళ్లిపోయాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అదితి శంకర్, దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Go Back to Shorts
Manchu Manoj
Tollywood

More Telugu News