ముంబైలో బస్సు బీభత్సం.. ఆరుగురి మృతి.. వీడియో ఇదిగో!
- 49 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
- కుర్లాలో అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు
- అపార్ట్ మెంట్ గేట్లను ఢీ కొట్టి సెల్లార్ లోకి వెళ్లి ఆగిన వైనం
వేగంగా దూసుకెళుతూ ముందు వెళుతున్న ఓ రిక్షాను, మూడు కార్లను, బైకర్లను పాదచారులను ఢీ కొట్టింది. ఆపై ఓ అపార్ట్ మెంట్ గేట్లను ఢీ కొట్టి సెల్లార్ లోకి వెళ్లి ఆగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలలో బస్సు వేగంగా దూసుకెళుతూ వాహనాలను ఢీ కొట్టడం కనిపిస్తోంది.