ఆ 700 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న బంగ్లాదేశ్
- జులై 19న ఢాకాలోని నార్సింగ్ జైలుకు నిప్పుపెట్టి ఖైదీలను విడిపించిన ఆందోళనకారులు
- దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, హంతకుల పరారీ
- ఆ తర్వాత 1500 మందిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
- మిగతా వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్న పోలీసులు
ఈ ఏడాది జులై 19న జరిగిన అల్లర్ల సందర్భంగా రాజధాని ఢాకాలోని నార్సింగి జైలుపై వందలాదిమంది దాడిచేసి నిప్పు పెట్టి అందులోని ఖైదీలను విడిపించారు. తప్పించుకుపోయిన ఖైదీల్లో ఆ తర్వాత దాదాపు 1500 మందిని తిరిగి అదుపులోకి తీసుకోగా, ఇంకా 700 మంది ఆచూకీ లేదని, వారిలో 70 మంది ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్టు వివరించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్టు చెప్పారు. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన ఉగ్రవాదులపై నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు.