లోక్ సభలో అన్నాచెల్లెళ్లు.. పెద్దల సభలో అమ్మ
- పార్లమెంట్ కు కలిసి రానున్న ముగ్గురు గాంధీలు
- ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక
- పార్లమెంట్ లో భార్యాభర్తలు, తండ్రీకూతుళ్లు
సోనియా గాంధీ పెద్దల సభలో ఉండగా.. అన్నాచెల్లెళ్లు రాహుల్, ప్రియాంక లోక్ సభలో కూర్చోనున్నారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇలా ముగ్గురు పార్లమెంట్ లో ఉండడం అరుదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్ సభలో భార్యాభర్తలు (అఖిలేశ్ యాదవ్, డింపుల్ యాదవ్), రాజ్యసభలో తండ్రి (శరద్ పవార్), లోక్ సభలో కూతురు (సుప్రియా సూలె) ఇప్పటికే పార్లమెంట్ లో ఉన్నారు. కాగా, అఖిలేశ్ యాదవ్ కజిన్స్ అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ కూడా లోక్ సభ సభ్యులుగా కొనసాగుతున్నారు.