ap cabinet meeting: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. 

ఎస్ఐపీబీ సమావేశంలో రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుతో పాటు, ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే అంశంపై మంత్రివర్గంలో చర్చించి, వాటికి ఆమోదం తెలియజేస్తుంది.  

అలాగే సూపర్ సిక్స్ పథకాల హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమలకు సంబంధించి భూకేటాయింపులపైనా కేబినెట్‌లో చర్చించనుంది.   
ap cabinet meeting
Chandrababu
Amaravati

More Telugu News