నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
- ఈ రోజు సాయంత్రం కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు
- బీజేపీ పెద్దలతోనూ సమావేశం అవ్వనున్న సీఎం
- రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.