కలెక్టర్పై దాడి ఘటన పట్ల తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ
- వికారాబాద్ కలెక్టర్, తహసీల్దార్పై దాడిని ఖండించిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
- కలెక్టర్, అధికారులపై దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోత్సహించారని ఆరోపణ
- కేటీఆర్ భూసేకరణ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
కలెక్టర్, అధికారులపై దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రోత్సహించారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారి కార్యకర్తలను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలతో కేటీఆర్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అధికారులపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.