ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో పెద్ద పులి కలకలం

tiger presence andhra odisha border
  • గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై దాడి చేసిన పెద్దపులి 
  • సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ అధికారులు
  • శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని గామాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు
ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో పెద్దపులి సంచారం తీవ్ర కలకలాన్ని రేపింది. గంజాం జిల్లా జయంతిపురంలో ఓ యువకుడిపై పెద్దపులి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. 

కాశిబుగ్గ రేంజ్ ఫారెస్టు ఆధికారి ఏ మురళీకృష్ణ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని పలు గ్రామాల్లో పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరూ పొలాలకు వెళ్లవద్దని అటవీ అధికారులు సూచించారు.
Go Back to Shorts
tiger presence
Tigar
Andhra Odissa Border

More Telugu News