పేద వర్గాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వంద గజాల లోపు ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ అవసరం లేదు: మంత్రి నారాయణ
- వంద గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ మంజూరు అవసరం లేదని చెప్పిన మంత్రి నారాయణ
- విశాఖలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
- 300 గజాలలోపు గృహాలకు సులువుగా అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు
పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను తొలగించేలా భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 300 గజాల్లోపు గృహాలకు ఈజీగా ప్లాన్ అప్రూవల్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వివిధ అంశాలపై అధికారులతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.