తాడేపల్లి నుంచి గుర్లకు బయలుదేరిన జగన్

వైసీపీ అధినేత జగన్ విజయనగరం జిల్లా గుర్లకు బయల్దేరారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన పయనమయ్యారు. 11 గంటలకు ఆయన గుర్లకు చేరుకుంటారు. డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం గుర్ల నుంచి తిరుగుపయనమవుతారు. 

డయేరియా కారణంగా గుర్లలో పెద్ద సంఖ్యలో ప్రజలు వాంతులు, విరోచనాలతో బాధ పడుతున్నారు. పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 


More Telugu News