తిరుమలలో శ్రీవారి ఆలయంపై ఎగిరిన హెలికాప్టర్
- తిరుమల కొండపై తరచూ హెలికాప్టర్ చక్కర్లు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు
- కొండపై నుంచి తాజాగా వెళ్లిన హెలికాప్టర్పై ఏవియేషన్ అధికారులకు టీటీడీ ఫిర్యాదు
తాజాగా సోమవారం కొండపై ఓ హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలాన్ని రేపింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది అనే దానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో వైపు హెలికాప్టర్ తిరుమల కొండపై నుండి వెళ్లడంపై ఏవియేషన్ అధికారులకు టీటీడీ ఫిర్యాదు చేసింది.