శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

CM Chandranbabu talks to Sri Satyasai district SP
  • చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఘటన
  • నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం వచ్చిన కుటుంబం
  • గత ఐదు నెలలుగా మిల్లు వద్దే ఉంటున్న కుటుంబం
  • గత రాత్రి కత్తులతో బెదిరించి అత్యాకోడళ్లపై అత్యాచారం చేసిన దుండగులు
శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు దుండగులు అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

ఇక్కడ నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం బళ్లారి నుంచి ఓ కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం గత  ఐదు నెలలుగా ఇక్కడే పేపర్ మిల్లు వద్దే ఉంటోంది. అయితే, గత రాత్రి బైక్ లపై వచ్చిన దుండగులు ఆ కుటుంబ యజమానిని, అతడి కుమారుడ్ని కత్తులతో బెదిరించి... అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ రత్నతో ఆయన మాట్లాడారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.
Go Back to Shorts
Chandrababu
SP
Sri Satyasai District
TDP-JanaSena-BJP Alliance

More Telugu News